9, జూన్ 2021, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 "ఆదుర్రు" - ఆదరణకి నోచుకోని 2,400 సంవత్సరాల కిందటి బౌద్ధ స్థూపం

 

ఆదరణకి నోచుకోని 2,400 సంవత్సరాల కిందటి బౌద్ధ స్థూపం - "ఆదుర్రు"

 ఆదుర్రుతూర్పు గోదావరి జిల్లామామిడికుదురు మండలానికి చెందిన ఈ గ్రామం గోదావరి ఉపనది - "వైనతేయ" నది ఒడ్డున ఉంది.



సిద్ధార్ధ బక్షి  గారు మా కుటుంబ మిత్రులు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో  ఉంటున్నారు.  ఆయన 70 సంవత్సరాల పుట్టినరోజు కార్యక్రమానికి నన్ను, మా వారిని ఆహ్వానించారు. మాతోబాటు సి. భాస్కర రావుగారు వచ్చారు. 

 

కార్యక్రమం మర్నాడు కాబట్టి,  ఇక్కడికి దగ్గరలో బౌద్ధ స్థూపం వుంది వెడదాం అన్నారు భాస్కరరావుగారు.  ఆయనతో కలిసి మేము  మండపేట నుంచి ఆటో మాట్లాడుకుని రావులపాలెం వరకు వెళ్ళాం. అక్కడ ఉన్నట్టుండి పెద్ద వర్షం. గబగబా షెల్టర్ లోకి వెళ్ళి, అక్కడే అమ్ముతున్న జామకాయలు కొనుక్కుని తిన్నాం.

 

వర్షం తగ్గాక అక్కడ ఏదో బ్రాహ్మణ హోటల్ ఫేమస్ అంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఆ ప్లేస్ లో అది లేదు కానీ, వేరే హోటల్ వుంది. నేను మాత్రం తినలేకపోయాను.  భోజనం అయ్యాక రావులపాలెం నుంచి రాజోలు చేరి మరో బస్ లో జగ్గన్నపేట చేరాం. అక్కడ ఆటో మాట్లాడుకుని మామిడి కుదురు వెళ్ళాం.  బౌద్ధస్థూపాలు చాలా లోపలికి వుంటాయని చెప్పారు అదే ఆటోలో లోపలికి వెళ్ళాం.

 

 చాలా కష్టపడి వెళ్ళినందుకు  అందమైన ప్రకృతి రమణీయత. అడవితల్లి ఒడిలో కాసేపు ఆనందం.

 

చుట్టూరా పచ్చదనం, కోనసీమ అందంమంతా అక్కడే ఉందేమో అనిపించింది. స్వాగతమిస్తున్న కొబ్బరి చెట్లు. అక్కడక్కడ గలగలా పారుతున్న పంట కాలవలు.

 

"నేలమీద ముగ్గులేసిన గడ్డి పువ్వులు, ఊడలు చాచిన అందమైన మర్రి చెట్టుకి దారంతా తివాచీ పరిచినట్లు వర్షానికి పట్టిన నాచు, నన్ను పరుగులు పెట్టించిన సీతాకోక చిలుక అలిసిపోయి ఒకచోట ఆగి ఫోటోకి పోజివ్వడం, మేమేం తక్కువని చిన్నచిన్న గడ్డిపూల సోయగాలు, ప్రేమగా పెనవేసుకుపోయిన అడవి లతలు అబ్బ ఒకటేమిటి అడవి అందాలు చూడాల్సిందే. వీటి మధ్యన బౌద్ధస్థూపాలు."

 

2,400 సంవత్సరాలకి ముందు బౌద్ధస్థూపాల్ని ఏర్పాటు చెయ్యవలసిందిగా అశోకుడి కుమారుడు మహేంద్ర - తన కవల సోదరియైన "సంఘమిత్ర, రాణి (అశోకుడి భార్య) దేవి"లను అదేశించాడు. వీరు ఆ కార్యక్రమంలో శ్రీలంక వెడుతూ మొట్టమొదటి బౌద్ధ స్థూపాన్ని "అదుర్రు"లో స్థాపించారట. అశోకుడు కట్టించిన 84 వేల స్థూపాలలో 64 మహాస్థూపాలు, అందులో మూడు దివ్యస్థూపాలు అని, ఆ మూడింటిలో ఆదుర్రు మొదటిది. ఈ స్థూపాల్ని స్థాపించి దానిని మొదటి గ్రామంగా ఏర్పాటుచేశారు. ఆది వూరు అది కాలక్రమేణా ఆదుర్రు అయింది.

 


 





































తెలియని కొత్త ప్రదేశం చూసుకున్నామని చాలా ఆనందంగా అనిపించింది.

 

2 కామెంట్‌లు:

  1. పూజ్యం శర్మ గారి ఇంట్లోనించి వచ్చె వేద పాఠాలు ఉపాధ్యాయుల చెణుల గారి ఫిడేలు NAGNAPAKALU

    రిప్లయితొలగించండి
  2. అవునాండీ... బలే జ్ఞాపకం. అలాంటివి చెవిలో వినిపిస్తున్నట్లే వుంటాయి.

    రిప్లయితొలగించండి