9, డిసెంబర్ 2020, బుధవారం

 

జ్ఞాపకాల పొదరిళ్లు ఆ వూళ్ళు 10


పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** ప.గో.జిల్లా


మినర్వా థియేటర్ (నిర్మాణం 1949)  ** 1 ***












మా తాతగారు సుబ్బారావుగారు 1949 నుంచి 1973 వరకూ అందులో పనిచేశారు.

మేము థియేటర్ లోకి వెళ్ళగానే సుబ్బారావుగారి మనవరాలిని అని చెప్పగానే చాలా మర్యాదగా లోపలికి పంపించారు.  వెళ్ళడమ్మా వెళ్లి మొత్తం అంతా చూడండి అన్నారు.

ఈ థియేటర్ చూసి పిల్లలు పడిన ఆనందం అంతా ఇంతా కాదు. 

అంత పాతకాలం సినిమా హాలు, అప్పట్లో సినిమాలు వేసే పద్ధతి,  వాళ్ళని చాలా ఆశ్చర్యపరిచింది.  బాల్కనీ అంటే నాలుగే నాలుగు కుర్చీలు. నేల టిక్కెట్టు అంటే నేలమీదే.  మేము వెళ్ళినప్పుడు సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టు సినిమా వేస్తున్నారు.  సినిమా చూసి వెళ్ళమన్నారు. మాకు అంత టైము లేదు.  పిల్లలు ప్రతిచోటా ఫోటోలు తీసుకున్నారు.

 

మా తాతగారి ఫోటో... ఆయన కూచున్న చోటు. మేము అక్కడ ఆడుకున్న చోటు అన్నీ చూపించాను. వాళ్ళకి నేను చూపిస్తూ పడిన ఆనందాన్ని వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.

ఇప్పుడు దాంట్లో కూడా కొత్త సాంకేతిక పద్ధతులు వాడుతున్నారు.

* * *

మా తాతగారు మల్లంపల్లి సుబ్బారావుగారు అప్పటి వరకూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని  1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఏలేటిపాడు నుంచి పెనుగొండకి మారారు. కుటుంబం పెరిగి, బాధ్యతలూ పెరిగాయి. వ్యవసాయంతో మాత్రమే కుటుంబ పోషణ సరిపోదు.   

లక్ష్మయ్యనాయుడు పెనుగొండ నియోజక వర్గం 1955, 1967లలో ఎమ్మెల్యేగా పనిచేసిన జమీందారు జవ్వాది లక్ష్మయ్యనాయుడు గారు  మా తాతగారి చిరకాల మిత్రులు. స్వాతంత్ర్యపోరాటంలో కలిసి పనిచేశారు.

లక్ష్మయ్యనాయుడుగారు మినర్వా థియేటర్ 1949లో కట్టించారు. దాని మేనేజ్ మెంట్ చూసుకోమని మా తాతగారికి అప్పగించారు. (ఇంకా వుంది)   

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి